ఏడుగురు కాంగ్రెస్‌ ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు

 కాంగ్రెస్‌ ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. సభ సజావుగా జరగకుండా ఆటంకం కలిగిస్తున్న ఈ ఏడుగురిపై స్పీకర్‌ ఓంబిర్లా చర్యలు తీసుకున్నారు. సభలో అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ఈ ఏడుగురు ఎంపీలను ప్రస్తుత సెషన్ నుంచి స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. సస్పెండ్‌ అయిన ఎంపీల్లో గౌరవ్‌ గోగోయ్‌, టీఎన్‌ ప్రతాపన్‌, డీన్‌ కురియాక్స్‌, మాణిక్‌ ఠాకూర్‌, బెన్నీ బెహ్నన్‌, గర్జిత్‌ అహ్లువాలియా, ఆర్‌. ఉన్నితన్‌ ఉన్నారు.